“మా స్వగ్రామం శ్రీకాకుళం. నా చిన్నతనంలో, బ్రతుకుదెరువు కోసం వ్యవసాయం పనులు చేసేవాడ్ని. ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని, మా కుటుంబం విజయవాడ వలస వచ్చాము. సిరామిక్ బొమ్మలు తయారుచేయడం ప్రారంభించి, ఇప్పటికి 30 సంవత్సరాలు పైనే అయ్యింది.ఈ బొమ్మల ప్రత్యేకత ఏంటంటే, వీటి కోసం మంచి నాణ్యత కలిగిన బంక మట్టిని వాడతాము. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. సెరామిక్ బొమ్మలు తయారుచేయడానికి, అలంకరించడానికి, అమ్మడానికి రోజుకి 14 గంటలు కష్టపడతాను. ఇతర బొమ్మల అందుబాటు వల్ల మేము కష్టపడుతుంటే, కరోనావైరస్ లాక్డౌన్ వల్ల మా కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సెరామిక్ బొమ్మలకి అంత డిమాండ్ లేదు. కుటుంబ పరిస్థితుల వల్ల, చిన్నప్పుడు చదువుకోనందుకు ఇంకా బాధపడుతున్నాను.దీని వల్ల, ప్రస్తుత సమాజంలో బ్రతకటం కొద్దిగా కష్టమవుతుంది. నా పిల్లలు నాలాగే అవడం నాకిష్టం లేదు. వాళ్ళకి మంచి చదువు అందించడానికి పగలూ రాత్రి కష్టపడుతున్నాను. వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని నా ఆశ.”