“సత్తెనపల్లి నుంచి మంగళగిరి వలస వచ్చినప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. నాకు జీవితం గురించి, జీవనం గురించి అసలు ఏమీ తెలీదు. కానీ, నాకు ఆ తపన ఉంది. జీవితంలో పెద్ద పెద్ద పనులు చేయాలని నాకు తపన ఉంది. ఆ తపనతోనే, సొంతంగా ఒక సా మిల్లు స్థాపించాను. ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. నేను జీవితంలో ఎన్నో చూశాను అని గర్వంగా చెప్పగలను. దాదాపు 50 సంవత్సరాల నుంచి సొంతంగా కలప, సా మిల్లు డిపో నడుపుతున్నాను.
కస్టమర్లు చుట్టుపక్కన ఉండే అడవుల నుంచి, చెట్లని నరికి నా దగ్గరికి తీసుకుని వస్తారు. వాటిల్లో నుంచి కలప తీసిఎం వాళ్ళకి ఇస్తాము. 50 సంవత్సరాల పై నుంచే పని చేస్తున్నాను కాబట్టి, నా శరీరం ఇప్పుడు సహకరించట్లేదు. నా మనసు, ధ్యాస మాత్రమే ఇక్కడ ఉన్నాయి. నా శరీరం మాత్రం ఇక్కడ లేదు. నా నుంచి మిల్ బాధ్యత తీసుకున్నందుకు నా కొడుక్కి ధన్యవాదాలు చెప్పాలి. నా కలలని, ఆశయాలని వాడు ముందుకు తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాడు.
మా అమ్మాయిలకి పెళ్లిళ్లు అయిపోయాయి, వాళ్ళు స్థిరపడ్డారు కూడా. ఇప్పడు నేను, నా కుటుంబంతో సమయం గడపాలని అనుకుంటున్నా. డిపో పనులలో పడి నా కుటుంబానికి సమయం కేటాయించలేకపోయా. నేను కోల్పోయిన సమయాన్ని, ఇప్పుడు మా కుటుంబంతో గడుపుతున్నాను. నేను ఇప్పుడు మనవళ్ళు , మవరాళ్లతో ఆడుకుంటున్నాను.వాళ్ళ తెలివి నన్ను ఆశ్చర్యపరుస్తుంది. నా జీవితం సంతోషంగానే సాగింది అని మాత్రం చెప్పగలను.”