“ఈ నెల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. మాములుగా అయితే, పండగ సీజన్ లో వ్యాపారం బాగా సాగుతుంది. నేను, దాదాపు 10 సంవత్సరాల నుంచి పళ్ళు అమ్ముతున్నాను.
దీనికి ముందు , దాదాపు 20 సంవత్సరాల పాటు ఒక బంగారు కొట్టులో రోజు కూలీగా పనిచేశాను. అది చాలా కష్టంతో కూడుకున్న పని. వయసు పెరిగే కొద్దీ, నా వంట్లో సత్తువ తగ్గింది. దీని వల్ల, ఆ పని కొనసాగించలేకపోయాను.
సాధారణంగా, రెండు మూడు రోజులకి ఒకసారి పండ్లు రీ-స్టాక్ చేయాల్సి వస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్టు, భారీ వర్షాల వల్ల, అమ్మకాలు భారీగా పడిపోయాయి. కొన్ని రోజుల్లో, నా దగ్గర ఉన్న స్టాక్ అంతా అమ్మేయాలి, లేదంటే పళ్ళన్నీ పాడయిపోతాయి. నా దగ్గర ప్రస్తుతం 25,000 విలువ చేసే స్టాక్ ఉండిపోయింది.
నేను రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ పని చేస్తాను. నేను ఉండేది, రొక్కలపాలెం బాస్ స్టాండ్ దగ్గర. దీని వల్ల, నాకు ఇక్కడికి రావడం చాలా తేలిక అవుతుంది.
ఇప్పుడు నా వయసు 51 సంవత్సరాలు. పరిస్థితుల వల్ల, నేను ఈ వ్యాపారంలోకి దిగాను. కష్టపడి పనిచేస్తే, జీవితంలో ఏదైనా సాధించవచ్చని నా ప్రగాఢ నమ్మకం. నా భార్య, ముగ్గురు కూతుళ్ళ బాధ్యత నా మీద ఉంది. వాళ్ళు నా లాగా అవ్వడం నాకిష్టం లేదు. వాళ్ళు బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు చేయాలి. నేను ఇంత కష్టపడేది, వాళ్ళ జీవితాలు బాగుండాలనే!”