“మాది కుమ్మరి కుటుంబం. నేను కుండల తయారీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. అమ్మ కుండల తయారీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది. ఆడవారు మన్ను మిశ్రమాన్ని తయారుచేయడం, తుది తయారీ ప్రక్రియకి అంతా సమకూర్చడం మా ఇంటి విధి.
కస్టమర్ల అవసరానికి అనుగుణంగా, మేము వేరు వేరు రంగులు, ఆకారాల్లో ఉండే రకరకాల కుండలు అమ్మడం మొదలుపెట్టాము.
ఎండా కాలం, దసరా సమయంలో అమ్మకాలు చురుగ్గా ఉంటాయి. ఇంతకూ ముందు, మట్టి కుండలు కొనడానికి కస్టమర్లు నా షాప్ దగ్గరికి వచ్చేవారు. కానీ, ప్రజల్లో ఉండే కోవిడ్-19 భయం వల్ల, అమ్మకాలు దాదాపు 70 శాతం పడిపోయాయి.
ఇంతకు ముందు ఎండాకాలంలో వెయ్యికి పైనే కుండలు అమ్ముడుపోయేవి. పండగ సమయంలో ఆ సంఖ్య మరింత పెరిగేది.ఈ కరోనా మహమ్మారి మూలాన, పెద్దగా అమ్మకాలు లేవు. ఇప్పటివరకూ ఇంతటి నష్టాలు మేమెప్పుడూ చూడలేదు.
నేను పోషించాల్సిన వాళ్ళు ఇంట్లో ముగ్గురున్నారు. ఈ మట్టి కుండల వ్యాపారమే మాకున్న ఏకైక ఆధారం. మేము దాచుకున్న డబ్బంతా ఈ కరోనా సమయంలోనే అయిపోయింది. ఇప్పుడు వ్యాపారం లో వచ్చే రాబడితో జీవనం కష్టతరంగా మారింది.
నాకున్న దాంట్లోనే, నా ముగ్గురు పిల్లలని పెంచాను. ఇప్పుడు, వ్యాపారం, ఇంటి బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిన సమయం వచ్చింది.నేను ఇంకో సంవత్సరమో , రెండు సంవత్సరాలో పనిచేస్తాను. ఆ తరువాత విరామం తీసుకుని జీవితంలో ఇతర విషయాలను అన్వేషిస్తాను.”