“ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. గత 13 సంవత్సరాల నుంచి నేను సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తునాను. మా స్వస్థలం విజయవాడ. నా యవ్వనంలో నేను ముంబయి కి వెళ్ళిపోయాను. ఒక దశాబ్దం పాటు పట్టణంలో రకరకాల ఉద్యోగాలు చేశాను. ఆ తరువాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాను. వ్యాపారంలో బాగా నష్టపోయాను. అందుకని మా సొంతఊరు వచ్చి, ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 2008లో, నేను సెక్యూరిటీ కంపెనీ లో చేరాను. ఇప్పటి వరకూ రకరకాల పరిశ్రమలు, కంపెనీలు, బ్యాంకులు, ఏటీఎం , ప్రైవేట్ కంపెనీలు, మీడియా సంస్థలు, ఆసుపత్రులలో పనిచేశాను.
సెక్యూరిటీ గార్డు ఉద్యోగమంటే, చాలా కష్టమైన పని. ఇరవై నాలుగు గంటలూ అప్రమత్తంగా ఉండాలి.ఆఫీసులు, బ్యాంకులకు కాపలా ఉండటం నా పని. దానితో పాటు, వచ్చే ఉత్తరాలు సేకరించడం, అక్కడికే వచ్చే పోయే వారి వివరాలు రిజిస్టర్ లో రాయడం కూడా నా పనే.
నా నెల జీతం 16,000 రూపాయలు. అవి, ఇంటి అద్దె లాంటి నా అవసరాలకకు సరిపోవు. నేను ఉండేది అజిత్ సింగ్ నగర్ స్ట్రీట్ లో. ఇప్పుడు మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మా పాప ఇంటర్మీడియేట్ చదువుతుంది. అమ్మాయి చదువుకి కొద్దికొద్దిగా డబ్బులు కూడబెడుతున్నాను. కష్టాలు ఉన్నప్పటికీ, నేను చేసే ఉద్యోగం నాకు సమాజం పట్ల కొంత బాధ్యత కల్పించింది. దీని వల్ల, ప్రజలు నన్ను గౌరవిస్తారు.
కరోనా వైరస్ మహమ్మారి వల్ల పరిస్థితులు కష్టంగా మారాయి. ఇలాంటి సమయంలోనే మనం బాధ్యతగా వ్యవహరించాలి.ఒక సెక్యూరిటీ గార్డు గా, ప్రతిఒక్కరినీ భద్రంగా ఉంచేలా ప్రయత్నిస్తాను.నా జీతం రెండు నెలల పాటు ఆపేసినా కూడా, బాధ్యతగా ఈ లక్డౌన్ సమయంలో కూడా నేను పని చేశాను.
ఈ లక్డౌన్ సమయంలో, నా స్నేహితులు కొంతమంది ఉద్యోగాలు వదిలి, వాళ్ళ సొంత ఊర్లకి వెళ్లిపోయారు. మహమ్మారి వ్యాపించే సమయంలో పని చేయడం కష్టమే. మేము కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు చెప్పండి?”