“నేను గత 8 సంవత్సరాల నుంచి విజయవాడలో పల్లీలు అమ్ముతున్నాను. వేయించిన పల్లీల నుంచి వచ్చే సువాసన, తాజా పల్లీలు ఉడకపెట్టిన వాసన కస్టమర్లను నా బండి వైపు నడిపిస్తాయి. ఇంతకు ముందు నేను పంజా సెంటర్ మెయిన్ రోడ్ లో వ్యాపారం చేసే దాన్ని. కోవిడ్-19 ప్రోటోకాల్స్ వల్ల, నా బండిని ఈ గాంధీ హిల్ ఏరియా కి మార్చమన్నారు. మాది ఒక చిన్న వ్యవసాయ కుటుంబం. నేను పెరిగింది అంతా గుంటూరులోనే. పేదరికం వల్ల, మా తల్లిదండ్రులు నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడే నాకు వివాహం చేశారు. గతంలో, మా ఆయన సోడాలు అమ్మేవారు. నేను ఇంట్లో ఉంటూ పన్లు చూసుకునేదాన్ని. కాలం వేగంగా గడిచి, మాకు ఇద్దరు కూతుళ్ళు కలిగారు. వ్యాపారంలో బాగా నష్టాలు రావడంతో, మా పరిస్థితి మరింత దిగజారింది. మా ఆయన ఆరోగ్యం కూడా పాడయింది.
మా ఆయన ముందుకి బానిస అవడంతో జీవితం మరింత దుర్భరంగా మారింది. ఆయన మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, ఆయనకి వైద్యం చేయించాలని అన్నారు. నా భర్తని, ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడేయడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను.
మా వారిని గుంటూరు లో మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాము. చికిత్సకి అయ్యే ఖర్చులు భరించడానికి మా వద్ద డబ్బులు లేవు. ఆయనకి ఎలాగైనా చికిత్స చేయించాలని 3 లక్షలు లోన్ తీసుకున్నాను. మా ప్రయత్నాలు సఫలం కాలేదు. ఏడునెలల వ్యవధిలోనే, మూత్రపిండాల వైఫల్యంతో ఆయన మరణించారు. ఆయన మరణం నన్ను కలచివేసింది. మా కూతుర్లిద్దరి బాధ్యత నా మీద ఉంది. మా కుటుంబం నాకు ఆర్థిక సహాయం చేయలేదు. ఏం చేసినా నేనే చేయాలి.
మొదట్లో, ఈ బాధ నుంచి బయటపడటానికీ, జీవితాన్ని ఎదురుకోవడానికి ధైర్యాన్ని పెంపొందించుకోవడం మీద దృష్టి పెట్టాను. పిల్ల చదువు కోసం, మా ఆయన సోడా వ్యాపారంలో రెండు షిఫ్టులు పనిచేసేదాన్ని.దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.కొన్ని సంవత్సరాలు పనిచేశాక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. సోడా వ్యాపారం కొనసాగించలేని పరిస్థితి.ప్రస్తుతం, నేను ఉడకపెట్టిన, వేయించిన పల్లీలు అమ్ముతున్నాను. మూడు సంవత్సరాల క్రితం, మా పెద్దమ్మాయికి పెళ్ళి చేయగలిగాను.సంతోషం కలిగించే విషయం ఏంటంటే, మా కూతుళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆనందం, విజయంలో నిండాలని నేను ఎప్పుడూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను.”