“మేము ఐదురుగు పిల్లలం. ఐదుగురు తోబుట్టువులలో ప్రస్తుతం ఇద్దరం మాత్రమే మిగిలాం. అప్పట్లో మా అమ్మా నాన్న గుంటూరులోని సూర్య లంక బీచ్ లో ఎండు చేపలు అమ్మేవారు. పరిస్థితులు అనుకూలించక నేను చదువుకోలేదు. చిన్నప్పుడు మేము చాలా కష్టాలు పడ్డాం. ఎంతలా అంటే రోజుకి ఒకసారి భోజనం చేయడం గగనం అయిపోయేది. నెలవారీ ఖర్చులకోసం నేను వేరే ఇళ్లల్లో పని చేసేదాన్ని. ఆ తరువాత ఆగిరిపల్లిలో కూరగాయలు అమ్మడం మొదలుపెట్టా. 30 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నా. సాధారణంగా నేను రోజూ ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూరగాయలు అమ్ముతాను. పదేళ్ళ క్రితం హార్ట్ ఎటాక్ తో మా ఆయన చనిపోయారు. ప్రస్తుతం నేను, నా కూతురు కుమారి, వాళ్ళ కుటుంబంతో కలిసి ఉంటున్నాను. అక్కడ బ్లూ కలర్ లో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు. మేము కూరగాయలు కొల్లి శారదా హోల్సేల్ వెజిటేబుల్ మార్కిట్ నుంచి కొనుగోలు చేస్తాము. లాక్డౌన్ వల్ల మూతపడ్డ ఈ మార్కెట్ ని పోయిన నెల మళ్ళీ తెరిచారు. తాజా కూరగాయల కోసం నేను తెల్లవారుఝామునే మార్కెట్ కి వెళ్తాను. నా పనయ్యాక నేరుగా ఇంటికి వెళ్తాను. సాయంత్రం నేను చేసే పని ఒకటే, నా మనవడితో ఆడుకోవడం. రిటైర్ అయ్యి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అవకాశం నాకుంది కానీ, నేను ఆ పని చేయను. మా కొట్టు పక్కనే వేరే విక్రేతలు కూడా ఉన్నారు కాబట్టి పోటీ బాగానే ఉంటుంది. ఒక్కోసారి అసలు వ్యాపారమే జరగదు. ఒక్కోసారి సాయంత్రానికే సరుకంతా అమ్ముడైపోతుంది. నా కూతురు పనికి ఢోకా లేదు కానీ వ్యాపారంలో నష్టపోయిన మా అల్లుడు మాత్రం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. మా అల్లుడికి ఉద్యోగం వచ్చేదాకా, నేను రైటర్ అవ్వలేను.”
![](https://humansofandhra.org/wp-content/uploads/2020/07/FB_IMG_1594903182449-970x728.jpg)