“పన్నెండు సంవత్సరాల క్రితం ఆటో నడపాలి అనుకున్నప్పుడు, నాకు వచ్చిన ఆలోచనలు రెండే. ఒకటి కొత్త వారిని కలిసే అవకాశం ఉంటుంది, రెండు ఒకే చోట ఆగిపోకుండా, బాగానే సంపాదించవచ్చు . మార్చి వరకు అంతా సవ్యంగానే నడిచింది. లాక్డౌన్ తరువాత అంతా తారుమారు అయ్యింది. దీని వల్ల, నాతో పాటు, రాష్ట్రంలో ఆటో యూనియన్ లోని డ్రైవర్లందరికీ కష్టాలు మొదలయాయ్యి.
లాక్డౌన్ లో సడలింపులు ఇచ్చినా కూడా, మాకు పెద్దగా పని లేదు. కరోనా వస్తుందేమో అనే భయంతో, ప్రజలు ఆటో లో ప్రయాణించడానికే భయపడుతున్నారు. ఇంతకు ముందు రోజుకి 700-800 వరకు సంపాదించేవాడ్ని. ఇప్పుడు ఆదాయం సగానికి పడిపోయింది. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి విధించిన మార్గదర్శకాల ప్రకారం, ఆటోలో కొంత మందిని మాత్రమే ఎక్కించాలంటే కష్టం. సిక్స్-సీటర్ ఆటోలో, కనీసం నలుగురు ప్రయాణికులని ఎక్కించడానికి ప్రభుత్వం అనుమతిస్తే బాగుంటుంది.
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు, ట్రైన్లకి అనుమతినిచ్చారు కాబట్టి, ఎక్కువగా పక్క జిల్లాల నుంచి వచ్చే ప్రయాణీకులే నా ఆటో ఎక్కుతారు. నా ఆటో ఎక్కే ప్రయాణీకులని, అనారోగ్యంగా ఉన్నారా లేదా కోవిడ్-19 ప్రభావిత జోన్లకి ప్రయాణించారా అని కూడా అడగలేని పరిస్థితి. వాళ్ళ గురించి ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే నాకు ఒక కుటుంబం ఉంది కాబట్టి. నా వంతు బాధ్యతగా, పేస్ మాస్క్ పెట్టుకుంటాను, ఆటోని డిసిన్ఫెక్ట్ తో శుభ్రం చేస్తాను. వీటితో వైరస్ ని నిరోధించవచ్చా?. ఏమో నాకు తెలీదు. వేరే మార్గం లేదు కాబట్టి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళాలి.”