“సాధారణంగా వారాంతాల్లో వ్యాపారం బాగా జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు వ్యాపారం అంత బాగా ఏమీ లేదు.నా దగ్గరికి వచ్చే కస్టమర్లు ఎక్కువగా కార్యాలయాలకి వెళ్ళే వాళ్ళే ఉంటారు. వెళ్ళేదారిలో ఆగి రుచికరమైన జామపళ్ళు ఆస్వాదిస్తారు.
నేను గత 20 సంవత్సరాలుగా విజయవాడ లో జామపళ్ళు అమ్ముతున్నాను. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, పైగా సంవత్సరం పొడుగూతా వీటిని సాగు చేయచ్చు.
90ల చివర్లలో ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఇక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండేది. అప్పుడు నా దగ్గరికి వచ్చే కస్టమర్లలో ఎక్కువ శాతం రోజంతా పనిచేసి బడలికతో ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు, నా దగ్గరికి వచ్చే కస్టమర్లు అపార్ట్మెంట్లలో, సింఘి నగర్ లో ఎక్కువగా ఉంటారు.
మా బంధువులు నా పని చాలా సులువనుకుంటారు. ఇందులో ఉండే కష్టం గురించి ఎవరూ ఆలోచించరు. నేను అమ్మే పళ్ళు తాజాగా ఉండేలా చూసుకుంటాను. పళ్ళను సరఫరా చేయడమే ఇందులో కష్టమైన పని. దీనికి చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ట్రాఫిక్ పోలీసులు, వీఎంసి అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది.
ఎవరైనా మీకు ఇందులో లాభాలు వస్తాయా అని అడిగితే నేను చెప్పేది ఒకటే. సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద షాపు వాళ్ళు కూడా పళ్ళు అమ్ముతారు కాబట్టి, నా వ్యాపారం మీద ప్రభావం చూపుతుంది. ఇంత దూరం వచ్చి నా దగ్గర పళ్ళు కొనే కస్టమర్లకు నేను రుణపడి ఉన్నాను. ఈ వ్యాపారం లో నాకు వచ్చే సంపాదన న కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుంది.”