“నాకు రత్నాల్లాంటి ముగ్గురు పిల్లలు. లాక్డౌన్ వల్ల, మమ్మల్ని సమస్యలు చుట్టుముట్టాయి. కరోనా మహమ్మారికి ముందు, నాకు, నా భర్తకి ఒక టిఫిన్ సెంటర్ ఉండేది.
ఇంతకు ముందు మాకు రోజుకి 1,000 రూపాయల ఆదాయం వచ్చేది. మా దగ్గరున్న సేవింగ్స్ అన్నీ చూస్తూ ఉండగానే ఖర్చయిపోయాయి. గ్యాస్ బిల్లు, ఇంటి అద్దె, రోజువారీ ఖర్చులు మా మీద అధిక భారాన్ని మోపాయి.
ఈ కష్టకాలంలో కుటుంబానికి సహాయంగా ఉంటుందని, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో కార్మికురాలిగా చేరాను. రోజుకి ఎనిమిది గంటలు పని చేస్తే, నా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను. ఈ కష్టకాలంలో, మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది.”