“రెండు రోజుల విహారయాత్ర కోసం, మేము జగ్దల్పూర్ నుంచి వైజాగ్ వచ్చాము. ఈ మధ్యనే మేము ఎంబీబీఎస్ పరీక్షలు రాశాము. నెలల తరబడి కష్టపడి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాం. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు కూడా తొందరలోనే ఉంటాయి. ఈ మధ్యలో ఒక విరామం తీసుకుంటే, బాగుంటుంది అనిపించింది.
పరీక్షలు రాసిన రోజే, వైజాగ్ వెళ్ళాలని, విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. వైజాగ్ రావడం మాకు ఇదే మొదటిసారి. ఇక్కడి బీచ్, ఫుడ్ మాకు బాగా నచ్చాయి. బీచులకి మానసిక స్వస్థత చేకూర్చే శక్తి ఉంటుంది. ఇక్కడికి వస్తే, నరాలు శాంతపడతాయి. ఇన్ని రోజులు కష్టపడినందుకు, మాకు లభించిన చిన్న బహుమతి ఇది. మా ఇద్దరికీ వైద్య రంగం అన్నా, జనాలకి సేవ చేయాలన్నా ఇష్టమే.
మేము ఇక్కడికి వెళ్తామంటే, మా తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. ట్రిప్ అయిపోయిన తరువాత, మేము ఫైనల్ సెమిస్టర్ మీద, మంచి చోట ఇంటర్న్షిప్ సంపాదించడం గురించి ఆలోచిస్తాం. పీజీ లో చేరడానికంటే ముందు మాకు మంచి చోట ఇంటర్న్షిప్ చేయాలని ఉంది.
లాక్డౌన్ సమయంలో కూడా, మేము గంటల తరబడి చదివాం. మంచి విషయం ఏంటంటే, కుటుంబంతో సమయం గడపడానికి మాకు అవకాశం లభించింది. చదువు కోసమని మేము ఎక్కువగా ఇంటికి దూరంగానే ఉంటాం. ఇంత కాలం ఇంట్లో వాళ్ళతో గడపడం ఇదే మొదటిసారి. దీని వల్ల మా తోబుట్టువుల గురించి ఎక్కువ తెలుసుకున్నాం.
ఈ ట్రిప్ తరువాత ఇంటికి వెళ్ళి మా కుటుంబ సభ్యులతో ఇంకొంత సమయం గడుపుతాం”.