“నా స్టాల్ రోజూ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. నా కస్టమర్లు ఎక్కువ శాతం విద్యార్థులే ఉంటారు. స్కూళ్ళు, కాలేజీలకు వెళ్తూ, మా స్టాల్ దగ్గర ఆగి జామ పళ్ళు తింటారు. కానీ, ఈ మధ్య ఎవరూ రోడ్ల మీద కనపడట్లేదు.
జామ పళ్ళు సంవత్సరం పొడుగూతా పండించవచ్చు.మా ఊరు సెరినరసన్నపాలెంలో మా కుటుంబానికి దాదాపు 10 జామ చెట్లు ఉన్నాయి. మా స్టాల్ లో ఉండే పళ్ళు ఎక్కువ శాతం మా చెట్ల నుంచే వస్తాయి.
90ల చివర్లో, నేను విజయవాడ కి వచ్చినప్పుడు ట్రాఫిక్ ఇంత ఉండేది కాదు. అప్పట్లో, ఇక్కడ చెట్లు బాగా ఉండేవి, వాతావరణం బాగా చల్లగా కూడా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వేడిని తట్టుకోవడానికి మంచి నీళ్ళు తాగాల్సివస్తుంది.
నాది చాలా తేలికైన పని అని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. పళ్ళు తాజాగా, సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు కూడా పళ్ళు, కూరగాయలు అమ్మడం మా వ్యాపారం మీద ప్రభావం చూపుతుంది. ఈ కరోనా మహమ్మారి ప్రభావం వల్ల కూడా, ప్రజలు బయట ఏమైనా కొనాలన్నా భయపడుతున్నారు.
వ్యాపారం బాగా జరిగిన రోజున, మా కుటుంబాన్ని పోషించుకోగలను. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్ళే నా ప్రపంచం. నేను సంపాదించేది వాళ్ళ కోసమే. భవిష్యత్తులో వాళ్ళని మంచి స్థానంలో చూడాలనుకుంటున్నాను.”