“మా దగ్గర శాఖాహార ఆహారం మాత్రమే దొరుకుతుంది. రండి రండి, పూరీలు వేయిస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ప్రతి రోజూ, మా స్టాల్ ఉదయం 6 గంటలకు తెరుస్తాము. కానక దుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి వేరే రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. దీంతో మా వ్యాపారం ఈ మధ్య బాగానే సాగుతుంది.
దసరా పండగ కాబట్టి, బ్రేక్ ఫాస్ట్ చేయడానికి చాలా మంది కస్టమర్లు మా స్టాల్ కి వస్తారు.గత 22 సంవత్సరాలుగా, మేము చిట్టూరి కాంప్లెక్స్ పక్కన ఈ చోటులోనే వ్యాపారం చేస్తున్నాం. మా దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు ఉదయాన్నే 6:30 గంటలకి మా స్టాల్ కి వచ్చేస్తారు. మేము ఇడ్లీలు తో వ్యాపారం మొదలుపెట్టాం. అయినా కూడా, ఈ మధ్య పూరీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ పూరీ తినండి. మెత్తగా, మృదువుగా ఉంది కదా?. పిండి సరిగా కలిపేలా నేను జాగ్రత్తలు తీసుకుంటాను.అపరిమిత చట్నీ, సాంబార్ తో వచ్చే బ్రేక్ ఫాస్ట్ 25 రూపాయలు ప్లేట్.
అన్ని నిత్యావసరాల ధరలు పెరగడం, కరోనా మహమ్మారి మా వ్యాపారం మీద పెద్ద ప్రభావమే చూపింది. మారుతున్న పోకడలు, రుచులకు తగ్గట్టు, మా మెన్యూ లో రకరకాల దోశలను చేర్చాము.
ఇన్ని సంవత్సరాలుగా, మా కస్టమర్లతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నాము. మా కస్టమర్లు వివిధ రాష్టాల వారు ఉన్నారు.కష్టమర్లు, పెద్ద రెస్టారెంట్లలో కంటే మా దగ్గర బ్రేక్ ఫాస్ట్ తినడానికే ఎక్కువ మక్కువ చూపుతారు. ఇలాంటి విషయాల గురించే మనం గర్వపడాలి. కాదంటారా?”