“నేను రోజూ సంపాదించే 250 రూపాయలతోనే నలుగురిని పోషించాలి. మా ఆయన ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తాడు, నేను ఒక అపార్ట్మెంట్ లో పనిమనిషిగా కుదిరాను. మేము ఉండేది కూడా ఈ అపార్ట్మెంట్ లోనే కాబట్టి, లాక్డౌన్ ఉన్నా కూడా నేను పనిచేయగలుగుతున్నాను. ఇక్కడ ఓనర్లు చాలా మంచివారు, మేము సురక్షితంగా ఉండటానికి మాకు మాస్కులు, శానిటైజర్లు ఇచ్చారు.
లాక్డౌన్ మూలాన గత ఎనిమిది రోజుల నుంచి మా ఆయన పనికి వెళ్ళలేకపోతున్నారు. దీంతో ఆయన ఇంట్లోనే ఉంటూ, మా పిల్లలు, అత్తగారితో సమయం గడుపుతున్నారు. పని దొరక్క పోతేఎం కొన్ని రోజుల్లోనే ఇంట్లో ఉండే ఆహారం అయిపోతుంది. కరోనా వైరస్ వల్ల ప్రమాదం అని తెలుసు కానీ, మా ఇంట్లో వాళ్ళు పస్తులుండటాన్ని నేను జీర్ణించుకోలేను.
కుటుంబాన్ని పోషించాలి అంటే నేను సంపాదించాలి. ప్రభుత్వం మాకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయబోతున్నట్టు తెలిసింది, కానీ ఎప్పుడు ఎలా అందిస్తారో మాకు తెలీదు. లాక్డౌన్ లేకపోయినా గత పదిరోజుల నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజారవాణా లేదు, పురిగా లాక్డౌన్ ఉండడంతో మా ఊరికి కూడా వెళ్లలేని పరిస్థితి. నేను ఇక్కడ విజయవాడలో ఇరుకున్నాను, గుంటూరులో ఉండే మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో అని భయంగా ఉంది. మా వాళ్ళు అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. రోజూ వాళ్ళకి ఫోన్ చేసి చేతులు కడుక్కోమని, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను.”