“నేను 7 సంవత్సరాలు ఒక పెద్ద సంస్థలో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేశాను. అప్పట్లో నా దృష్టంతా మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించడం, జీవితంలో స్థిర పడటం, కుటుంబాన్ని బాగా చూసుకోవడం వీటి మీదే ఉండేది. వారాంతం కోసం నేను ఆరు రోజులు కష్టపడి పనిచేసే వాడిని. కొన్ని రోజులు గడిచాక, దీని వల్ల శాంతి ఉండేది కాదు. కొన్ని నెలల తరువాత, ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాను. ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు, ఆహార రంగం బాగుంటుందని అనిపించింది. అలా వ్యవసాయం గురించి మా బాబాయి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆయన ఎప్పుడూ నన్ను వ్యవసాయం చేయమని ప్రోత్సహించేవాడు, అలాగే కొద్దిగా రిస్క్ ఉంటుందని భయపడేవాడు. ఇందులో పెద్ద సమస్య పనివాళ్ళను వెతకడం. వాళ్ళు సంపాదించే దాని కంటే ఎక్కువ సంపాదన చూపకపోతే, పని వాళ్ళు దొరకడం కష్టమని బాబాయి చెప్తూ ఉంటాడు. దీని వల్ల వ్యవసాయంలో కొత్త ధోరణిలు నాకు తెలిశాయి. మా నాన్నకి కొంత భూమి ఉంది కానీ అది బీడు భూమి. దాంతో నేను ఆధునిక వ్యవసాయ పద్దతుల మీద అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. బాగా అధ్యయనం చేశాక, నా 4 సంవత్సరాల ప్రోవిడెంట్ ఫండ్ ఇందులో పెట్టుబడి పెట్టాను. ఒకవేళ ఈ ప్రయత్నము విఫలమైతే వెనక్కి వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకున్నా. మొదట్లో చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు బాగానే లాభాలు వస్తున్నాయి. నేను సాంప్రదాయ కూరగాయల పెంపకం, మొదలుపెట్టాను. మార్కెట్ రీసెర్చ్ నాకు మరింత మెరుగ్గా పనిచేయడానికి సాయపడింది. మొదట్లో నన్ను చాలా మంది ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. కానీ ఇప్పుడు నేను వాళ్ళకంటే రెండింతలు సంతృప్తిగా ఉన్నాను, సంపాదిస్తున్నాను కూడా.”
![](https://humansofandhra.org/wp-content/uploads/2019/11/IMG_20191031_181300_110_39349367.jpg)