“నేను ఒక్కడినే ఉన్నప్పుడు, ఒంటరిని అనే భావన కలిగేది. సోషల్ మీడియా, మొబైల్ గేమింగ్ వల్ల, నా ఒంటరితనం మరింత ఎక్కువయింది. నేను కోరుకోని విషయాలను కూడా ఇవి అందించడమే దీనికి కారణం. దీంతో భవిష్యత్తు మీద భయం మొదలయ్యి, నా రోజువారి ప్రణాళిక మీద కూడా పట్టు కోల్పోయాను.
దేశంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి, ఆ సమయాన్ని నన్ను నేను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. వంట చేయడం, మెడిటేషన్ చేయడం, రాయడం అలవాటు చేసుకున్నా. అలా చేయడం వల్ల, నా ఏకాగ్రత, భావోద్వేగ స్థితి బాగా మెరుగుపడ్డాయి. మెడిటేషన్ నా మీద ఎంతలా ప్రభావం చూపిందంటే, నేను ఒంటరిగా కూర్చోగలుగుతున్నాను. నన్ను నేను అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాక, ఏకాంతాన్ని ఆస్వాదించగలిగాను, అలాగే స్వీయ క్రమశిక్షణను పాటించగలుగుతున్నాను.జీవితంలో నేను అనుభవిస్తున్న శూన్యతా భావాన్ని పూరించడానికి, నాకు సోషల్ మీడియా కానీ, స్మార్ట్ ఫోన్ కానీ అవసరమే లేదు. ఇప్పుడు జీవితం బాగుంది. మెడిటేషన్ చేయడం, రాయడం నాకు మంచి అనుభూతినిచ్చింది. దీని వల్ల, నా గురించి నేను బాగా తెలుసుకోగలిగాను. దీన్ని నేను ఆస్వాదిస్తున్నాను.”