“మనకి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ముందుకు సాగుతూ ఉండాలి. నా దగ్గర ఉన్నదల్లా నవ్వులు మాత్రమే. నేను 1996 నుంచి ఈ మార్కెట్ లో కర్చీఫులు, నాప్కిన్లు, మ్యాట్లు అమ్ముతున్నాను. వేరే మార్కెట్లలో, ఇతర విక్రేతలను గమనించాను. వాళ్ళ నుంచి ప్రేరణ పొంది, బీసెంట్ రోడ్ లో ఈ వ్యాపారం ప్రారంభించాను. ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టడం మంచి నిర్ణయమనే అనుకుంటున్నాను. టౌన్ లో ఎవరికి ఏం కావాలన్నా, ఈ మార్కెట్ కే వస్తారు. కరోనా మహమ్మారి వల్ల, ప్రస్తుతం వ్యాపారం అంత సజావుగా సాగట్లేదు. ఇంతకు ముందు, వ్యాపారం బాగానే సాగేది. కొన్ని రోజుల్లో, వ్యాపారం మెరుగవుతుందని ఆశిస్తున్నాను.
నేను జీవితంలో సంతృప్తిగా ఉన్నాను. చిన్న చిన్న విషయాలను కూడా ఆస్వాదిస్తాను. నేను 4 వ తరగతి వరకే చదువుకున్నాను. 10వ తగతి వరకూ చదువుకోలేకపొయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. ఒకేవేళ చదువుకోనుండి ఉంటే, ఇండియన్ రైల్వేస్ లో పెయింటర్ గా మా అంకుల్ ఉద్యోగం నాకు లభించేది. ప్రాథమిక విద్య లేనందు వలన మా అంకుల్ చనిపోయిన తరువాత, ఆయన ఉద్యోగం నేను పొందలేకపోయాను. జీవితంలో ఇలాంటి బాధలు, వస్తూ పోతుంటాయి. నా జీవితం ఏర్పడిన విధానం పట్ల, నేను సంతృప్తిగా ఉన్నాను. నా జీవితం విషానికి వస్తే, , నాది సాధారణమైన మరియు సంతృప్తికరమైన జీవితం. మార్కెట్ లో పనిచేశాక ఖాళీ దొరికితే, నా భార్య పిల్లలతో గడుపుతాను. పిల్లలని బాగా చదువుకోమని చెప్తూ ఉంటాను. వాళ్ళు బాగా చదువుకుంటే, జీవితంలో మంచి స్థానానికి చేరుకోవచ్చు. వాళ్ళని స్నేహితులతో కలిసి సినిమాలు చూడటానికి వెళ్ళమని చెప్తుంటాను. కరోనా వల్ల, ఈ మధ్య మనం సినిమాలు ఫోన్ లోనే చూస్తున్నాం. సినిమాలు చూడటానికి ఒక మార్గం వెతుక్కున్నట్టు, జీవితంలో ప్రతీ విషయానికి కూడా ఒక మార్గం చూసుకోవాలి”