” దాదాపు 20 సంవత్సరాల క్రితం, అంటే నేను టీనేజిలో ఉన్నప్పుడు, జీవనాధారం కోసం విజయవాడ కి మకాం మార్చాను.
విజయవాడ కి వచ్చిన కొత్తలో 50 పైసలకి టీ అమ్మేవాడ్ని. ఇప్పుడు నేను, రకరకాల సాంప్రదాయ సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తాను. ఇడ్లి, దోశ, పూరీ లాంటి టిఫిన్ మాత్రమే కాకుండా, ఎగ్ బోండా, ఎగ్ దోశ, అలాగే పన్నీర్ దోశ లాంటి కస్టమర్లు ఎక్కువగా తినడానికి ఇష్టపడే స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ లు కూడా తయారు చేస్తాను.
ఉదయం 4 గంటలకి నా రోజు మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకూ వేడి వేడి టిఫిన్స్ అందిస్తాను. దాదాపు గత 10 సంవత్సరాల నుంచి, నా దగ్గరే టిఫిన్ తినే కస్టమర్లు చాలా మందే ఉన్నారు. అందుకే, ప్రతి రోజూ, మంచి టిఫిన్ అందించడానికి ప్రయత్నిస్తాను.
ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి వల్ల, నా లాంటి ఎన్నో చిన్న ఫుడ్ జాయింట్స్ బాగా దెబ్బతిన్నాయి. అయినా కూడా నేను అధైర్యపడను. ఇక్కడికి రావడానికి, నేను కొన్ని సంవత్సరాలు శ్రమించాను. అందుకే, నేను కష్టపడటం ఆపను
నేను, ఈ ఫుడ్ పాయింట్ వ్యాపారం నా జీవనాధారం కోసమే పెట్టాను. అయినప్పటికీ, నాకంటూ ఒక గుర్తింపు రావడానికి సహాయం చేసిన విజయవాడ నగరానికి, నగర ప్రజలకి ఎంతో రుణపడి ఉన్నాను.”