“వ్యాపారం కోసం నేను ఏలూరు నుంచి విజయవాడ వచ్చాను. మొదట్లో పల్లీలు అమ్మేవాడ్ని. కొన్ని నెలల తరువాత పళ్ళు అమ్మడం మొదలుపెట్టాను. నా దగ్గర ఒకే ఒక తోపుడు బండి ఉంది. వ్యాపారం బాగానే నడుస్తుంది కాబట్టి, వ్యాపార సాధనాన్ని మార్చే ఉద్దేశం నాకు లేదు.
కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది అని నమ్మే మనిషిని నేను. అందుకే నేను కష్టపడి పనిచేస్తాను. నా సంపాదన, తిండికి ఇంట్లో వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి సరిపోతుంది. ఒకవేళ నష్టం వాటిల్లితే, నెలవారీ ఖర్చులకి ఏమీ ఇబ్బంది ఉండదు.
నా రోజు ఉదయం 8 గంటలకి మొదలవుతుంది. దగ్గరలో ఉండే హోల్ సేల్ ఫ్రూట్ మార్కెట్ నుంచి పళ్ళు కొని 9 గంటలకి నా వ్యాపారం మొదలుపెడతాను. మార్కెట్ లో కొన్న పళ్ళని ఒక క్రమ పద్దతిలో అమరుస్తాను. సాయంత్రం 6 గంటల వరకూ నేను వ్యాపారం చేస్తాను. ఇంతకు ముందు నేను రాత్రిళ్ళు కూడా పనిచేసేవాడ్ని. కరోనా మూలాన నా వ్యాపారం త్వరగా ముగిస్తున్నాను.
నేను కర్బూజ, ఆపిల్, నారింజ, దానిమ్మ లాంటి అన్ని రకాల పళ్ళు అమ్ముతాను. పక్కనే ఉన్న ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఆపిల్స్, కర్బూజ ఎక్కువగా కొంటారు.వాటి మీదే నాకు ఎక్కువ లాభాలు వస్తాయి.
ఖాళీ సమయంలో నేను ఎక్కువగా సినిమాలు చూస్తుంటాను. మరీ ముఖ్యంగా పాత సినిమాలు చూస్తుంటా. నా కొడుకు స్మార్ట్ ఫోన్ లో, పెద్ద ఎన్టీఆర్ సినిమాలు చూస్తాను. ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి ఉంది. కానీ దాన్ని ఎలా వాడాలో నాకు తెలీదు.
నేను ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు పైనే అయ్యింది. ఇన్ని సంవత్సరాలలో ఈ నగరం, ప్రాంతం బాగా మారిపోయింది. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో, ఎప్పుడో కార్లు, మోటార్ సైకిళ్ళు కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాత విజయవాడ తో పోలిస్తే, ప్రస్తుతం ఉన్న విజయవాడ నాకు బాగా ఇష్టం. వినియోగదారులు నా దగ్గరికి వచ్చినంత వరకూ, నాకు కాలుష్యం, వేడి, జనాల రద్దీ గురించి పెద్దగా పట్టింపు లేదు.”