“నా జీవితం మొత్తం నేను ప్రకృతికే అంకితం చేశాను. మనకి వ్యవసాయానికి సంబంధించి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇప్పుడు నా వయసు 83 ఏళ్ళు. టీనేజ్ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను.
వ్యవసాయం అనేది పేదవాళ్ళు, చదువురాని వాళ్ళు చేసేపని అని అంటుంటారు అందరూ. ఈ మాట వింటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అందరూ మూడు పూటలా తింటారు కానీ రైతులని గౌరవించరు.
ఇంటర్మీడియట్ అయిపోయాక నేను వ్యవసాయ రంగంలోకి దిగాను.మాకు ఉండే 12 ఎకరాల భూమిలోనే, మా పూర్వీకులు చేస్తూ వస్తున్న పనినే కొనసాగించి రైతులకి ఉండే అపోహలు తీర్చాలని నిర్ణయించుకున్నా. స్థిరమైన వ్యవసాయం కోసం నేను వివిధ రకాల వ్యవసాయ పద్దతుల మీద రీసెర్చ్ చేశాను.
నా పొలంలో కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు అలాగే ఔషధ మొక్క పెంచుతాను. పర్యావరణ హితమైన వ్యవసాయ పద్దతుల మీద నేను ఆల్ ఇండియా రేడియో లో చాలా సార్లు మాట్లాడాను. భూక్షయం అవ్వకుండా ఉండటానికి నేను బహుళ పొర పంటని సమర్ధిస్తాను. ఈ నేలంతా సేంద్రియ పదార్థాలతో నిండి ఉంది దాన్ని నేను పాడుచేయదలుచుకోలేదు. రైతులకి ఎదురయ్యే అతిపెద్ద సమస్య వాతావరణ మార్పు. వ్యవసాయం విషయానికొస్తే, సరైన వర్షం పడకపోవడం, భూగర్భ జలాల నీటి మట్టం విలువలు తగ్గిపోవడం కూడా అతిపెద్ద సమస్యే.
నేను ప్రజలకి సలహా ఇవ్వదలుచుకున్నా. అదేంటంటే మనం ప్రకృతిలో ఒక భాగం అందుకే ప్రకృతికి అనుగుణంగా జీవించి ప్రయత్నించాలి.మనం మనకంటే పెద్దదైన వ్యవస్థ లో ఉన్నామనే విషయం గుర్తుపెట్టుకోవాలి!”